విక్రమార్క రాజు మరియు భట్టి మంత్రులు
ఒక రోజు భట్టిమరియు విక్రమార్కా వేట కోసం అడవికి వెళ్ళారు. అక్కడ వారు కాళిమత ఆలయాన్ని చూశారు. అక్కడ 'పుష్కరిని' అనే చెరువు ఉండేది. ఆ చెరువు మధ్యలో 'త్రిశూల్' అనే మూడు ముఖాల ఆయుధం ఉంది. చెట్టు పైకి ఎక్కి ఎవరైనా తమ ప్రాణాన్ని అర్పించినట్లయితే వారిని కాళీమాత ఆశీర్వదిస్తుందని శిల మీద రాసి ఉంది. అది చదివిన విక్రమార్క ముందు వెనుక ఆలోచించకుండా చెట్టు ఎక్కి చెరువులోకి దూకాడు. ఆయుధం అతని గుండెలోకి చొచ్చుకుపోయింది. అప్పుడు కాళీమాత ప్రత్యక్ష మై విక్రమార్కను సజీవంగా చేసింది. ఆమె అతన్ని ఒక వరం ఇస్తూ నీవు నీ సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు నిరంతరం పలిస్తావు అని చెప్పింది .అప్పుడు విక్రమార్క భట్టిని కలుసుకుని ఏమి జరిగిందో చెప్పాడు. వారు సంతోషంగా వారి సామ్రాజ్యానికి తిరిగి వెళ్లిపోయారు కొంత కాలం తరువాత విక్రమార్క అసంతృప్తి చెందసాగాడు. నీ అసంతృప్తి కి కారణంఏమిటని బట్టి, విక్రమార్కుని అడిగాడు. 'నేను వెయ్యి సంవత్సరాలు జీవిస్తాను . కానీ నీవు వంద సంవత్సరాలలో ప్రపంచ...